TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. ఎండాకాలంలో ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు.. బస్టాండ్స్లో ఫ్యాన్లు, కూలర్లు, బెంచీలతో పాటు మంచి నీటి వసతిని కల్పించాలని ఆర్టీసీ నిర్ణయించింది.
Hyderabad TSRTC Will Arrange Fans and Coolers and Water Facility in Bus Stands Due to Summer Heat Wave
ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీఎస్ఆర్టీసీ ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలు చేపడుతోంది. ఎండాకాలం నేపథ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బస్టాండ్స్లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు మంచి నీటి సదుపాయం కల్పించనుంది.
వేసవిలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశించారు. బస్టాండ్ల్లో తాగునీరు సదుపాయంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
వేసవిలో ఇబ్బంది పడుకుండా… ప్రయాణికుల సౌకర్యార్థం.. బస్ స్టాండ్స్లో ఫ్యాన్లు, కూలర్లు, బెంచీలను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్లోని బస్ భవన్ లో ఆర్ఎంలు, డీఎంలు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని… వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు సజ్జనార్. రాబోయే కాలం టీఎస్ఆర్టీసీకి ఎంతో కీలకమని.. ఆ మేరకు అధికారులందరూ పూర్తిగా సన్నద్ధం కావాలని సూచించారు.
వేసవిలో ఆర్టీసీ బస్సుల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు.. ఎండ వేడిమి, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి ఉపశమనం కలిపించేలా.. ఫ్యాన్స్, కూలర్స్లు ఏర్పాటు చేయనున్నారు. వారి దాహార్తి తీర్చేందుకు మంచి నీళ్ల వసతి కూడా కల్పించనున్నారు.